న్యూఢిల్లీ, డిసెంబర్ 15: పశ్చిమ ఉక్రెయిన్లో ఓ గ్రామ కౌన్సిలర్ తోటి సభ్యులపై గ్రనేడ్తో దాడి చేయడంతో 26 మంది గాయపడ్డారు. ముఖజీవ్ జిల్లా కెరెట్స్కై గ్రామంలో శుక్రవారం కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా ఆ కౌన్సిలర్ జేబులోంచి మూడు గ్రనేడ్లు బయటకు తీసి విసిరాడు. దీంతో సభ్యులు భయంతో అరుస్తూ పెద్దగా కేకలు వేశారు.
గ్రనేడ్ పేలుడుకి 26 మంది గాయపడగా, అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కౌన్సిలర్ ఎందుకీ చర్యకు పాల్పడిందీ వెల్లడి కాలేదు. కాగా, రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న క్రమంలో పౌరులు ఆయుధాలు కలిగి ఉండటానికి ఉక్రెయిన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో చాలామంది మారణాయుధాలు ధరించి తిరుగుతున్నారు.