విభిన్న చిత్రాల్లో నటిస్తూ బాలీవుడ్ అగ్రతారగా ఎదిగింది కృతి సనన్. తాజాగా ఆమెకు దిగ్గజ బాలీవుడ్ నాయిక, మెలొడీ క్వీన్గా పేరున్న మీనా కుమారి బయోపిక్లో నటించమంటూ కబురందింది. టీ సిరీస్ సంస్థ మీనాకుమారి జీవితకథా చిత్రాన్ని నిర్మిస్తున్నది. బాల నటిగా తెరకు పరిచయమై అగ్ర తారగా ఎదిగింది మీనాకుమారి. 40, 50 దశకాల్లో తిరుగులేని నాయికగా పేరు తెచ్చుకుంది. ట్రాజెడీ క్వీన్గా గుర్తింపు పొందింది. 38 ఏళ్ల వయసులో మీనా కుమారి జీవితం నాటకీయంగా మలుపులు తిరిగి ముగిసింది. మీనా కుమారి బయోపిక్లో నటించడం సంతోషంగా ఉందని చెబుతున్నది కృతి సనన్. తన కెరీర్ లో ఇదొక ప్రత్యేక చిత్రంగా మిగిలిపోతుందని ఆశిస్తున్నది. మరిన్ని ఈ చిత్ర వివరాలు త్వరలో తెలియనున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ తో ‘ఆదిపురుష్’ చిత్రంతో పాటు ‘షెహజాద’, ‘భేడియా’, ‘ఘనపత్’ వంటి సినిమాల్లో నటిస్తున్నది కృతి.