నల్లగొండ : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని చిట్యాల పట్టణానికి చెందిన కుక్కల నవనీత మెహన్ 200 మంది తన అనుచరులతో కలిసి బీఆరెస్లో చేరారు. స్థానిక మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కుక్కల నవనీత మోహన్ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో గ్యార ఇస్తారి, అమరోజు మదన్, కుక్కల శ్రీను, పిడుగు శ్రీకాంత్ రెడ్డి, కడారి సత్యనారాయణ, బాకీ నాగరాజు జిట్టా సాయి, బోడ దినేష్, MD నయిమ్, బోడ రామ్, కోనేటి యాదయ్య, చింతకాయల మహేష్, అమరోజు మధుసూదన్, మేడి నర్సింహా, శంకర్, జిట్టా శ్రీధర్, జిట్టా చిన్న సాయి, అమరోజు వెంకన్న ఉన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆవుల అయిలయ్య యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, PACS వైస్ చైర్మన్ మెండే సైదులు, కౌన్సిలర్ లు జిట్టా పద్మ బొందయ్య, కోనేటి కృష్ణ, బెల్లి సత్తయ్య, పొన్నం లక్ష్మయ్య, BRS పట్టణ శాఖ అధ్యక్షుడు జిట్టా చంద్రకాంత్, ప్రధాన కార్యదర్శి, చిట్యాల లారీ అసోసియేషన్ అధ్యక్షుడు జిగిని భిక్షంరెడ్డి, సిలివేరు శేఖర్, దాసరి నరసింహ చిత్రగంటి ప్రవీణ్, యాకరి నరేందర్, గోలి భాస్కర్, చిత్రగట్టి నాగరాజు, యాసిన్ పాల్గొన్నారు.