యాదాద్రి భువనగిరి :
పోలీసులంటే కర్కషంగా ఉంటారనే భావన చాలా మందింలో ఉంటుంది. అయితే అందరూ అలా ఉండరని వారిలోనూ మానవత్వం మూర్తిభవిస్తుందని కొన్ని కొన్ని సంఘటనలు రుజువు చేస్తుంటాయి. తాజాగా జిల్లాలోని బీబీ నగర్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి (పోలింగ్ కేంద్రం నం.369) ఎమ్మెల్సీ ఓటు వేసేందుకు ఓ మహిళ తన చంటి పాపతో వచ్చింది.
ఈ సందర్భంగా అక్కడ ఎన్నికల విధుల్లో ఉన్న బీబీనగర్ పోలీస్టేషన్ ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ కవిత ఓటు వేయడానికి వచ్చిన సదరు మహిళ కూతురును ఆలనా పాలనా చూసుకుంది. పాప తల్లి లైన్లో నిలబడి ఓటు వేసి వచ్చే వరకు ఓపికగా ఆ చిన్నారికి సపర్యలు చేసింది. ఈ విషయం తెలుసుకున్న రాచకొండ సీపీ మహేష్ భగవత్ మహిళా కానిస్టేబుల్ను అభినందించి రివార్డు ప్రకటించారు.