న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఆర్కే సింగ్ అందరి దృష్టిని ఆకర్షించారు. వారిద్దరూ పీపీఈ కిట్ ధరించారు. పోలింగ్ కేంద్రంలోకి పీపీఈ కిట్తోనే వెళ్లి ఓటేశారు ఇద్దరు మంత్రులు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ వీల్ చైర్లో వచ్చి పోలింగ్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. 89 ఏండ్ల మన్మోహన్ సింగ్.. వీల్చైర్లో పార్లమెంట్కు రావడం ఇదే ప్రథమం. ఇక పోలింగ్ ప్రారంభమైన మొదటి గంటలోనే ప్రధాని మోదీ, మన్మోహన్ సింగ్ తో పాటు పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసేందుకు ఎంపీలు బారులు తీరారు.
Union Finance Minister Nirmala Sitharaman and Union Power Minister RK Singh cast their votes for the Presidential polls in PPE kits as they are suffering from COVID-19 pic.twitter.com/lwqHIuHV2O
— ANI (@ANI) July 18, 2022