ములుగు : జిల్లాలో మావోయిస్టులను హతమార్చేందుకు అమర్చిన మందు పాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆదేశాల మేరకు రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన వాజేడు మండలం పెనుగోలు గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఈ నెల 5వ తేదీన అమర్చిన మందుపాతరలను అమర్చారు.
కాగా, వెంకటాపురం సీఐ శివప్రసాద్, వాజేడు ఎస్ఐ తిరుపతిరావు, బీడీ టీమ్ సభ్యులు మందుపాతరలను నిర్వీర్యం చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
పోలీసులను హతమార్చడమే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఒక ప్రెజర్ కుక్కర్ బాంబు, 20 మీటర్ల కార్డ్ ఎక్స్ వైర్, రెండు డిటోనేటర్లు, 34 బ్యాటరీలు, ఒక కెమెరా ఫ్లాష్ వంటి పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.