మెదక్ : ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటల నుంచి ఈస్టర్ వేడుకలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి.
గుడ్ ఫ్రైడే రోజు శిలువపై అవుసులు బాసిన యేసు ప్రభువు మూడో రోజున సమాధి నుంచి భక్తులకు దర్శనమిస్తాడు. కాళ్లు, చేతులకు కొట్టిన మేకుల గాయాలను చూసి గుర్తెరిగి యేసయ్య లేచి వచ్చాడని ఆనందోత్సాహాలతో భక్తులు పోతారు.
త్వరలో ఈ లోకానికి వస్తా.. అప్పటి వరకు నేనున్నాని తెలియజేయండి అని యేసు ప్రభువు వెళ్లి పోతాడు. దీనినే క్రైస్తవులు ఈస్టర్ (పునరుత్థాన పండుగ) పండుగగా జరుపుకుంటారు.
ఈస్టర్ పురస్కరించుకుని భక్తులు తరలి రావడంతో చర్చి ప్రాంగణమంతా కిటకిలాడింది. కరోనా నేపథ్యంలో చర్చికి వచ్చే భక్తులకు శానిటైజేజేషన్ చేసిన తరువాతే అనుమతించారు.
ఇవి కూడా చదవండి..
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి : మంత్రులు
జొన్నకుప్ప దగ్ధం.. రూ.45వేల నష్టం
ఆలస్యంగా నిద్ర పోతున్నారా..? మెదడు పనితీరు తగ్గుతుందట..!
లారీని ఢీకొట్టిన కారు..వ్యక్తి మృతి
నిజామాబాద్లో వృద్ధ దంపతుల ఆత్మహత్య