న్యూఢిల్లీ : యూపీలోని 75 జిల్లాల పేర్లను 38 సెకండ్లలో చదివిన చిన్నారి బాలిక వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. బాలిక టాలెంట్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. యూపీలోని దియోరియా జిల్లాకు చెందిన బాలిక క్లిప్ను శుభాంకర్ మిశ్రా ట్విట్టర్లో షేర్ చేశారు.స్కూల్ యూనిఫాం ధరించిన బాలిక 75 జిల్లాల పేర్లను అక్షర క్రమంలో కేవలం 38 సెకండ్ల వ్యవధిలో చదవడం పట్ల నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు.
कमाल की बच्ची है। इस बच्ची के हुनर को आप भी करेंगे सलाम
उत्तर प्रदेश के देवरिया की इस बच्ची ने बिना रुके सिर्फ 38 सेकंड में यूपी के 75 जिलों के नाम गिना दिए, वो भी अक्षरों के क्रम के हिसाब से। #Deoria pic.twitter.com/lNto24lpQ7
— Shubhankar Mishra (@shubhankrmishra) September 13, 2022
బాలికను దియోరియా జిల్లా ఆదర్శ్ ప్రాధమిక విద్యాలయ విద్యార్ధి మాన్వి చౌరాసియాగా గుర్తించారు. అమేజింగ్ ఈ బాలిక నైపుణ్యానికి మీరు శాల్యూట్ చేస్తారని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.ఈ వీడియోకు ఇప్పటివరకూ 21,500 వ్యూస్ రాగా పెద్దసంఖ్యలో నెటిజన్లు స్పందించారు. బాలిక నైపుణ్యాన్ని మెచ్చుకున్న నెటిజన్లు ఆమెకు మంచి భవిష్యత్ ఉందని బ్లెస్ చేశారు.