చెన్నై : కోయంబత్తూర్లోని ఓ ప్లైవుడ్ స్టోర్పైకి గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ బాంబులు విసిరిన ఘటన కలకలం రేపింది. కోయంబత్తూర్లోని మెయిన్ రోడ్డుపై షాపులో ఈ ఘటన జరగడంతో ఉద్రిక్తత నెలకొంది.
మెట్టుపాళ్యం రోడ్డుపై మదన్ కుమార్, సచిన్కు చెందిన షాపు కిటికీలను పగలగొట్టిన దుండగులు లోపలికి పెట్రోల్ బాంబులు విసిరారు. గురువారం రాత్రి స్టోర్ మూసివేసిన తర్వాత ఈ ఘటన జరిగింది. షాపు సిబ్బంది ఉదయం రాగానే కిటికీ అద్ధాలు ధ్వంసమై ఉండటంతో వారు లోపలికి వెళ్లి చూడగా దుండగులు కిటికిల్లోంచి లోపలికి పెట్రోల్ బాంబులు విసిరినట్టు గుర్తించారు.
ఈ ఘటనలో ప్లైవుడ్ స్టాక్ కొంతమైర దగ్ధమైంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. కాగా, కోయంబత్తూర్లోని బీజేపీ కార్యాలయంపైకి కూడా దుండగులు గురువారం రాత్రి పెట్రోల్ బాంబులు విసిరారు.