ఇస్లామాబాద్: దేశాన్ని నడుపడానికి అవసరమైనంత డబ్బు తమ దగ్గర లేదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ తెలిపారు. దీంతో ప్రజా సంక్షేమ పథకాలపై పెద్ద మొత్తంలో నిధుల్ని ఖర్చు చేయలేకపోతున్నామన్నారు. విదేశీ అప్పులు పెరిగిపోవడం, పన్ను వసూళ్లు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో దేశ భద్రతకు కూడా నిధుల కొరత ఏర్పడిందన్నారు. విదేశీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే పరిస్థితులు మళ్లీ తలెత్తినట్టు వాపోయారు.