లాహోర్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్సింగ్ సిద్ధూ మరో వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ తనకు సోదరుడి లాంటి వాడంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పంజాబ్ స్థితిగతులు మార్చాలనుకుంటే పాక్తో వాణిజ్యానికి సరిహద్దులు తెరువాలని సిద్ధూ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీనిపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శనివారం సిద్ధూ పాక్లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ మీద బీజేపీ విమర్శలు గుప్పించింది.