ముంబై : జై శ్రీరాం అనేందుకు నిరాకరించడంతో ఇమాంపై దాడి చేసి అతడి గడ్డాన్ని కత్తిరించిన ఘటన కలకలం రేపింది. మహారాష్ట్రలోని (Maharashtra ) అన్వ గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఉదంతం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గ్రామంలోని మసీదులో ఇమాం జకీర్ సయ్యద్ ఖాజా ఖురాన్ చదువుతుండగా ముఖాలు కనిపించకుండా ముసుగు వేసుకున్న వ్యక్తులు లోనికి చొరబడి ఇమాంను జైశ్రీరాం అని నినదించాలని కోరారు. ఇమాం నిరాకరించడంతో ఆయనను బయటకు తీసుకువెళ్లి దారుణంగా కొట్టారు. దాడి చేసిన వారు రసాయనం పూసిన వస్త్రాన్ని వాడటంతో తాను స్ప్రహ కోల్పోయానని ఇమాం చెప్పారు. తాను తిరిగి స్ప్రహలోకి రాగానే తన గడ్డాన్ని వారు కత్తిరించినట్టు గ్రహించానని అన్నారు.
రాత్రి 8 గంటల సమయంలో ప్రార్ధన చేసేందుకు స్ధానికులు మసీదు వద్దకు రాగా అక్కడ ఇమాం అచేతనంగా పడిఉండటాన్ని గమనించారు. ఇమాంను వారు సిల్లోద్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్యుల సూచన మేరకు ఔరంగాబాద్లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఘటన అనంతరం గ్రామానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read More
India Corona | కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. 11 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు