హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): నాంపల్లి మసీద్ సమీపంలోని వక్ఫ్స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ, పోలీసు అధికారులు శనివారం తొలిగించారు. వక్ఫ్స్థలం ఆక్రమణకు గురికాగా.. బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ స్థలాన్ని మూడునెలల్లోగా బోర్డుకు అప్పగించాలని ధర్మాసనం ఆదేశించింది. ఆ గడు వు శనివారంతో ముగియగా.. చైర్మన్ సలీం.. రెవెన్యూ, పోలీసు అధికారులను పంపించి అక్రమ నిర్మాణాలను తొలగింపజేశారు. వక్ఫ్ స్థ లాల కోసం న్యాయస్థానాల్లో పోరాడుతున్నామని సలీం తెలిపారు.