హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) 10వ ప్లీనరీని అక్టోబర్లో హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించాలని ఐజేయూతోపాటు తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) సంయుక్తంగా నిర్ణయించాయని టీయూడబ్ల్యూజే అధ్యక్షు డు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఈ ప్లీనరీకి 28 రాష్ర్టాల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ హాజరవుతారని తెలిపారు.
ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐజేయూ అధ్యక్షుడు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు వినోద్ కోహ్లీ, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సలహాదారు, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతీసాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్ హజారి, చండీగఢ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నవీన్ శర్మ, తెంజు అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, కార్యదర్శి రమణకుమార్తోపాటు రాష్ట్ర, జాతీయ సంఘ నాయకులు హాజరయ్యారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు లెనిన్, హైదరాబాద్ అధ్యక్షుడు యోగానంద్, కార్యదర్శి నవీన్కుమార్, రాష్ట్ర నాయకులు రాజమౌళిచారి, సూరజ్ భరద్వాజ, రాజ్నారాయణ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.