సంగారెడ్డి, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మ విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) అద్భుత ఘనత సాధించింది. ‘వైసిగ్ నెట్వర్క్స్’ అనే స్టార్టప్తో కలిసి దేశీయంగా సొంత 5జీ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఐదేండ్ల సంయు క్త పరిశోధనలతో రూపొందించిన ఈ టెక్నాలజీ ని మంగళవారం విజయవంతంగా పరీక్షించిం ది. స్వదేశీ బేస్ స్టేషన్ సెల్ టెక్నాలజీ సాయంతో తొలిసారి 5జీ ఓరాన్ (ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్) డాటా కాల్ చేసింది. 3.3-3.5 గిగాహెర్ట్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో 100 మెగాహెర్ట్ బ్యాండ్విడ్త్కు సపోర్ట్చేసే మల్టీపుల్ ఇన్పుట్-మల్టీపుల్ ఔట్పుట్ (ఎంఐఎంవో) టెక్నాలజీతో ఈ కాల్ను చేయడం విశేషం. ఇది ప్రపంచంలో నే అత్యున్నతమైన టెక్నాలజీగా పరిగణించబడుతున్నది.
విదేశాలకు సైతం అందించేందుకు రెడీ
అధిక వేగంతో కూడిన 5జీ వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్, ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) సేవలను అందించడంలో దేశం ఉన్నత స్థానానికి చేరేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంద ని వైసిగ్ నెట్వర్క్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ సాయిధీరజ్ వివరించా రు. ఈ సేవల కోసం సెల్టవర్లలో ఉపయోగించే పెద్ద బేస్ స్టేషన్లు, మైక్రో బేస్స్టేషన్లు, రిలే బేస్ స్టేషన్లను (ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు లేకుండా పనిచేయగలిగేవి) తయారు చేసినట్టు తెలిపారు. 5జీ ఓరాన్ టెక్నాలజీని జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు అందజేసేందుకు సిద్ధ్దంగా ఉన్నామని చెప్పారు.
విప్లవాత్మక టెక్నాలజీ..
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖతోపాటు టెలికం విభాగం సహకారంతో 5జీ ఓరాన్ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్టు ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. ఐఐటీహెచ్ను 5జీ ప్ర పంచ పటంలో పెట్టడంలో విజయం సాధించామని, వైసిగ్ నెట్వర్క్స్తో కలిసి 100 పేటెంట్లు తయారు చేశామని చెప్పారు. ఓరాన్ 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అత్యవసరమై న 15 స్టాండర్డ్ ఎసెన్షియల్ పేటెంట్లను పొందినట్టు తెలిపారు. 5జీ ఓరాన్ డాటాకాల్ విజయవంతం దేశీయ 5జీ టెక్నాలజీ రంగంలో మైలురాయిగా ఐఐటీహెచ్ ప్రొఫెసర్ కిరణ్ కూచి అభివర్ణించారు.