చెన్నై : వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఐఐటీ మద్రాస్ ఈ-మొబిలిటీలో ఇండస్ట్రీ ఆధారిత ఆన్లైన్ సర్టిఫికెట్ ప్రోగ్రాంను ప్రారంభిస్తోంది. ఈ కోర్సులో తొమ్మిది మాడ్యూల్స్కు గాను నాలుగు మాడ్యూల్స్కు పరిశ్రమకు చెందిన ప్రొఫెషనల్స్ కంటెంట్ అందిస్తారు. పరిశ్రమ నిపుణుల ఇన్పుట్స్తో కూడిన సర్టిఫికెట్ ప్రోగ్రాంను టెక్నాలజీ, మార్కెట్ ట్రెండ్స్, పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిరంతరం అప్గ్రేడ్ చేస్తామని ఐఐటీ మద్రాస్ పేర్కొంది.
ఐఐటీ మద్రాస్కు చెందిన సెంటర్ ఫర్ అవుట్రీచ్ అండ్ డిజిటల్ కమ్యూనికేష్ (కోడ్) విభాగం ఈ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సులో భాగంగా ఈ-మొబిలిటీ ఎకో సిస్టంకు సంబంధించిన వివరాలు, వాహన అభివృద్ధి, పవర్ ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ ఇంజనీరింగ్, థర్మల్ మేనేజ్మెంట్, పవర్ ట్రెయిన్ వంటి సాంకేతిక అంశాల్లో ప్రాధమిక వివరాలపై అవగాహన కల్పిస్తారు.
వివిధ పరిశ్రమలు, శాఖల్లో పనిచేసే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం తాము ఈ ప్రోగ్రాంను లాంఛ్ చేశామని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి పేర్కొన్నారు.ఇక ఈ కోర్సుకు సంబంధించి 2022 అక్టోబర్ బ్యాచ్కు రిజిస్టర్ చేసుకునేందుకు సెప్టెంబర్ 20 చివరితేదీ అని అధికారులు తెలిపారు.