చెన్నై : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మద్రాస్ (ఐఐటీ-ఎం) కాలేజ్ క్యాంటిన్లో పనిచేసే కార్మికుడిని క్యాంపస్లో సెకండియర్ విద్యార్ధినిని లైంగిక వేధింపులకు గురిచేసిన ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఐటీ-ఎంలో న్యూ అకడమిక్ కాంప్లెక్స్ (ఎన్ఏసీ) సమీపంలో జులై 24న లైంగిక వేధింపుల ఘటన జరిగింది.
విద్యార్ధిని సైకిల్పై తన హాస్టల్కు తిరిగివస్తుండగా క్యాంటిన్ వర్కర్ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాధితురాలు స్వల్ప గాయాలతో బయటపడింది. రెండు రోజుల తర్వాత బాధితురాలి స్నేహితురాలు ద్వారా మేనేజ్మెంట్ దృష్టికి వెళ్లింది.
సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన మీదట క్యాంటిన్ వర్కర్ వేధింపులకు పాల్పడినట్టు గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆగస్ట్ 2న అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని బిహార్లోని నవాదా జిల్లాకు చెందిన చందన్ కుమార్గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.