న్యూఢిల్లీ: గౌహతిలో ఐఐటీ పరిశోధకులు కృత్రిమ కాలును డెవలప్ చేశారు. అడ్వాన్స్డ్ ఫీచర్స్తో దీన్ని రూపొందించారు. భారతీయ అవసరాలకు తగినట్లు ఈ ప్రొస్థెటిక్ లెగ్ను డిజైన్ చేశారు. కొండలు ఎక్కడంలోనూ ఈ కృత్రిమ కాలు ఉపయోగపడనున్నది. ఇక కాళ్ల మీద కూర్చునే వీలుగా దీన్ని డిజైన్ చేశారు. వివిధ వయసులో ఉన్నవారికి లాభపడే రీతిలో ప్రోస్థెటిక్స్ను అభివృద్ధి చేశారు. కేంద్ర విద్యాశాఖ, భారత ప్రభుత్వం, బయోటెక్నాలజీ శాఖ, ఐఐటీ గౌహతి పరిశోధకులు ఈ కృత్రిమ కాలు తయారీకి నిధులు అందజేశారు. 151 ఆర్మీ బేస్ హాస్పిటల్తో జతకట్టిన పరిశోధకులు ఈ కాలును రూపొందించారు. అయితే చాలా చౌక ధరలోనే ఈ కృత్రిమ కాలును మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నారు. మోకాలి వద్ద ఉన్న స్ప్రింగ్ వ్యవస్థ భారతీయ శౌచాలయ విధానానికి బాగా ఉపయోగపడుతుందని ఐఐటీ ప్రొఫెసర్ ఎస్ కనకరాజ్ తెలిపారు.