మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ నుంచి రెండో గీతం ‘పెన్నీ..’ ఆదివారం విడుదలైంది. ఈ పాట ద్వారా మహేష్బాబు తనయ సితార వెండితెరపై అరంగేట్రం చేసింది. చక్కటి నృత్యం, హావభావాలతో ఆకట్టుకుంది. ‘చక్ చక్ దే దే..చక్ చక్ దే దే..చెక్కెయ్యాలని చూశావంటే చుక్కలు చూస్తావే..డేటిచ్చాక దాటిందంటే ధమ్కీ తప్పదురే..’ అనే పల్లవితో సాగే గీతంలో మహేష్బాబు ైస్టెలిష్గా కనిపించారు. ‘ఇటీవల విడుదల చేసిన పాట ప్రోమోకు మంచి స్పందన లభించింది. తమన్ చక్కటి స్వరాల్ని అందించారు. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతున్నది. వేసవి కానుకగా మే 12న విడుదల చేస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్నది. వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్. మది, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, రచన-దర్శకత్వం: పరశురాం.