వాషింగ్టన్, ఏప్రిల్ 15: ఇండియాకు ఎవరు హాని తలపెట్టాలని చూసినా వారిని వదిలిపెట్టబోమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాను ఉద్దేశించి అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం శాన్ఫ్రాన్సిస్కోలో భారత సంతతి అమెరికన్లు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. గల్వాన్లో భారత సైనికుల వీరోచిత పోరాటాన్ని గుర్తు చేశారు. ‘ఒక దేశంతో కలిసి ఉండాలంటే మరో దేశానికి దూరం కావాలి’ అన్న విధానానికి భారత్ ఎప్పుడూ దూరమేనని అమెరికాను ఉద్దేశించి అన్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో భారత్ తమ బాటలో నడవకపోవడంపై అమెరికా గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే.