చేవెళ్ల రూరల్, డిసెంబర్ 31: పట్టణాలకు దీటుగా గ్రామాలు అభివృద్ధిలో పరుగులు పెడు తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పట్టణాలకు దీటుగా అభివృద్ధిలో ఆద ర్శంగా నిలుస్తున్నాయి. చేవెళ్ల మండల పరిధిలోని తంగడిపల్లి గ్రామం అభివృద్ధి పనులు పూర్తి చేసుకొని ముందుకు సాగుతున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలకు అధిక నిధులు కేటాయిస్తూ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నది.
తంగడిపల్లి (మడికట్టు అనుబంధ గ్రామం) గ్రామ జనాభా 3950, ఓటర్లు 2304 మంది ఉన్నారు. గ్రామ పంచాయతీలో రూ.5 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రూ.36 లక్షలతో తంగడిపల్లి, మడికట్టు గ్రామాల్లో సీసీ రోడ్లు, రూ.2.5 లక్షలతో వీధి దీపాల ఏర్పాటు, రూ.60 వేలతో 16 సీసీ కెమెరాలు, రూ.10 లక్షలతో ట్రాక్టర్, రూ.10 లక్షలతో వైకుంఠ ధామం నిర్మాణం, రూ.2.4 లక్షలతో డంపింగ్ యార్డు, రూ.40 వేలతో నర్సరీ, పల్లె ప్రకృ తి వనం దాదాపు రూ.70 వేలతో పనులు చేపట్టారు. ఇంకా రూ.50 లక్షల పనులు చేపట్టాల్సి ఉన్నది. గ్రామంలో వైకుంఠధామం ఏర్పాటుతో గతంలో ఏర్పడ్డ ఇబ్బందులు తొలగిపోయాయి. పారిశుధ్య నిర్వహణకు సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి తడి, పొడి చెత్తను పంచాయతీ ట్రాక్టర్లో వేసి డంపిండ్ యార్డుకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన రహదారికి ఇరువైపులా, గ్రామ పరిసరాల్లో హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్నిస్తున్నాయి. మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.
పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక
తడి, పొడి చెత్త సేకరణ, వాటిని వేరు చేసి తడి చెత్త ద్వారా ఎరువు తయారు చేయు ట, పొడి చెత్త రీసైక్లింగ్కు ఉపయోగించుటలో పైలట్ ప్రాజెక్ట్ కింద గ్రామం ఎం పికైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద మూడు గ్రామాలు ఎంపి కయ్యాయి. అవి చిలుకూరు , ఆలూరు , తంగడిపల్లి గ్రామాలను అధికారులు ఎం పిక చేశారు. అందులో భాగంగా రెండు గ్రామాలతో పోలిస్తే తంగడిపల్లి 90 శాతం పురోగతి సాధించింది.
అందరి సహకారంతోనే ..
ప్రభుత్వం సకాలంలో నిధులు అందించింది. అదేవిధంగా ప్రజా ప్రతినిధులు, ప్రజల సహకారంతో గ్రామంలో అభివృద్ధి సాధ్యమైంది. మున్ముందు ప్రభుత్వ సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మండలంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతా.
మరింత బాధ్యత పెరిగింది..
గ్రామ సమస్యలపై రాజీ లేకుండా ప్రభుత్వ నిధులు సద్వినియోగం చేసు కొని ప్రజలకు మౌలిక వసతుల కల్ప నకు కృషి చేస్తున్నాం. పారిశుధ్య నిర్వ హణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. తడి, పొడి చెత్తను వేరు చేసి ఎరువులను తయారు చేస్తున్నాం. మా గ్రామం పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక కావడంతో మరింత బాధ్యత పెరిగింది.
– సురేందర్రావు, పంచాయతీ కార్యదర్శి