న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి కొత్త రూల్స్ను ప్రకటించింది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఆ రూల్స్ అమలులోకి రానున్నాయి. క్రీడాకారుల ప్రవర్తనా నియమావళిలో మార్పులు కోరుతూ సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని బృందం చేసిన సూచనలను కమిటీ ఆమోదించింది. ఆస్ట్రేలియాలో వచ్చే నెలల జరగనున్న టీ20 వరల్డ్కప్లో ఈ కొత్త రూల్స్ అములోకి వస్తాయి.
బ్యాటర్ క్యాచ్ ఔట్ అయితే..
ఒకవేళ బ్యాటర్ క్యాచ్ ఔట్ అయితే, అప్పుడు కొత్తగా వచ్చే బ్యాటర్.. స్ట్రయికర్ ఎండ్లోనే ఆడుతాడు. గతంలో ఈ రూల్ మరోలా ఉండేది. క్యాచ్ పట్టడానికి ముందే ఒకవేళ బ్యాటర్లు క్రాస్ అయితే అప్పుడు కొత్త బ్యాటర్ నాన్ స్ట్రయికర్ ఎండ్లోకి వచ్చేవాడు. ఇప్పుడు ఆ రూల్ మారింది.
ఉమ్మిపై నిషేధం
బంతిని మెరిసేలా చేసేందుకు బౌలర్లు ఉమ్మి రాయడం తెలిసిందే. అయితే ఇటీవల కోవిడ్ వల్ల బంతికి ఉమ్మిరాయ రాదు అని ఓ నిషేధాన్ని విధించారు. తాత్కాలికంగా రెండేళ్ల పాటు ఆ నిషేధం కొనసాగింది. అయితే ఇప్పుడు ఆ నిషేధాన్ని పర్మినెంట్ చేసేశారు. ఉమ్మి బదులుగా ఇటీవల ప్లేయర్లు.. చెమటతో బంతిని మెరిసేలా చేస్తున్నారు. ఆ ఫార్ములా వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది.
2 నిమిషాల్లోనే..
ఎవరైనా బ్యాటర్ ఔటైన తర్వాత క్రీజ్లోకి కొత్త బ్యాటర్ వచ్చే విషయం తెలిసిందే. అయితే ఆ కొత్త బ్యాటర్ కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే బంతిని ఎదుర్కోనేలా తయారు కావాలి. టెస్టులు, వన్డేల్లో ఈ రూల్ను ఫిక్స్ చేశారు. టీ20ల్లో మాత్రం 90 సెకన్ల వ్యవధి ఉన్న విషయం తెలిసిందే. గతంలో టెస్టులు, వన్డేల్లో కొత్త బ్యాటర్ క్రీజ్లోకి చేరుకునేందుకు మూడు నిమిషాల సమయం ఉండేది. నిర్దేశిత సమయంలో ఒకవేళ బ్యాటర్ రాకుంటే, అప్పుడు ఫీల్డింగ్ కెప్టెన్ టౌమౌట్ కోసం అప్పీల్ చేసుకోవచ్చు.
A host of important changes to the Playing Conditions that come into effect at the start of next month 👀https://t.co/4KPW2mQE2U
— ICC (@ICC) September 20, 2022