హైదరాబాద్, ఏప్రిల్ 27: ప్రముఖ వాహన విక్రయ సంస్థ హ్యుందాయ్ మోటర్.. హైదరాబాద్లో ఒకేసారి 8 షోరూంలను ప్రారంభించింది. అత్తాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్పీ రోడ్, తిరుమలగిరి, ఎర్రగడ్డ, మెట్టుగూడ, బొడుప్పల్ల్లో రిటైల్ అవుట్లెట్లను ఆరంభించింది.
ఈ సందర్భంగా హ్యుందాయ్ మోటర్ ఇండియా డైరెక్టర్ తరున్ గార్గ్ మాట్లాడుతూ..హైదరాబాద్ మార్కెట్ చాలా కీలకమని, కంపెనీకి చెందిన వాహనాలకు డిమాండ్ ఉండటంతో ఒకేసారి ఎనిమిది షోరూంలను ప్రారంభించినట్లు చెప్పారు.