ధర్మసాగర్ : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో క్రూర మృగం పశువుల పై దాడికి పాల్పడింది. క్రూర జంతువు దాడిలో లేగ దూడ అక్కడిక్కడే మృతి చెందింది. కాగా, నారాయణగిరి గ్రామానికి చెందిన పింగిలి బాపిరెడ్డి అనే రైతుకు చెందిన లేగా దూడ పై గుర్తుకు తెలియని క్రూర జంతువు దాడి చేసి చంపేసింది.
ఆదివారం ఘటన స్థలాన్ని అటవీశాఖ అధికారి రతన్ లాల్ పరిశీలించారు. దాడికి పాల్పడిన జంతువు హైనా గా అటవీశాఖ అధికారులు గుర్తించారు. రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ పుట్ట కుమారస్వామి, సుధాకర్, మల్లేష్, సంజీవ్, సదానందం తదితరులు పాల్గొన్నారు.