Hyderabad to Bengaluru | కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో మైసూర్, ఊటీ, బెంగళూరు చెప్పుకోదగ్గ ప్రదేశాలు. సమ్మర్కు ఊటీ బెస్ట్ ప్లేస్ అయితే.. భారతీయ సాంస్కృతిక, వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యాలుగా చెప్పుకునే ఎన్నో అద్భుత కట్టడాలు, ప్రదేశాలు చూసేందుకు మైసూర్, బెంగళూరు అనువైన ప్రాంతాలు. అయితే ఈ వేసవిలో బెంగళూరు(BENGALURU), మైసూర్ (MYSORE), ఊటీ(Ooty), వెళ్లాలనుకునే పర్యాటకులకోసం తెలంగాణ టూరిజం (Telangana Tourism) ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది
బెంగళూరు-ఊటీ-మైసూరు (BENGALURU-OOTY-MYSORE TOUR) పేరుతో తెలంగాణ టూరిజం (Telangana Tourism) ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోండగా.. ప్రతీ సోమవారం ఈ టూర్ ప్యాకేజీని (Tour Package) బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో ఊటీ (OOTY), కున్నూర్ (Kunnru), బొటానికల్ గార్డెన్స్ (Botanical gardens), ఊటీ లేక్(Ooty Lake) దొడబెట్ట పీక్ (Dodabetta), టీ మ్యూజియం (Tea Museum), పైకారా జలపాతం (Pykhara Falls), మైసూర్, బెంగళూరు తదితర పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా.. బస్సు మార్గంలో (BUS Route) ఈ టూర్ను ఆపరేట్ చేస్తున్నారు. ఇది 5 రాత్రులు, 6 రోజులు కొనసాగుతుంది.
‘బెంగళూరు-ఊటీ-మైసూరు టూర్’ ప్రయాణం ఇలా..
Day 1: మొదటి రోజు మధ్యాహ్నం హైదరాబాద్లో (Hyderabad) టూర్ ప్రారంభం అవుతుంది. యాత్రి నివాస్(Yatrinivas) నుండి మధ్యాహ్నం 03:30 గంటలకు.. బషీర్బాగ్లో సాయంత్రం 04:00 గంటలకు.. బస్సు బయలుదేరుతుంది. మొదటి రోజు బెంగళూరుకు ప్రయాణం ఉండగా.. ఓవర్ నైట్ జర్నీ (Overnight Journey) ఉంటుంది.
Day 2: రెండో రోజు ఉదయం బెంగళూరు చేరుకుంటారు. బెంగళూరు లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది. బుల్ టెంపుల్(Bull Temple), లాల్ బాగ్(Lal bagh), విశ్వేశ్వరయ్య మ్యూజియం(Visveswaraya Museum), ఇస్కాన్ టెంపుల్(Iskon Temple) దర్శించుకోవచ్చు. భోజనం తర్వాత రాత్రి బెంగళూరులో బస ఉంటుంది.
Day 3: మూడో రోజు తెల్లవారుజామున 4 గంటలకు ఊటీ బయలుదేరాలి. మధ్యాహ్నానికి ఊటీ చేరుకుంటారు. ఆ తర్వాత లోకల్ సైట్సీయింగ్ ఉంటుంది. దొడ్డపెట, బొటానికల్ గార్డెన్ చూడొచ్చు. భోజనం తర్వాత రాత్రి ఊటీలో బస ఉంటుంది.
Day 4: నాలుగో రోజు ఉదయం మైసూర్ బయలుదేరాలి. సాయంత్రానికి మైసూరు చేరుకుంటారు. అనంతరం బృందావన్ గార్డెన్ సందర్శన ఉంటుంది. రాత్రికి భోజనం, మైసూరులో బస ఉంటుంది.
Day 5: ఐదో రోజు ఉదయం 7 గంటలకు మైసూరు లోకల్ సైట్సీయింగ్ ఉంటుంది. చాముండేశ్వరి ఆలయం(Chamundeswari Temple), మైసూరు మహారాజ ప్యాలెస్(Mysore Maharaja Palace), బిగ్ బుల్ టెంపుల్(Big Bull Temple) సందర్శించొచ్చు. తిరుగు ప్రయాణంలో రాత్రి మైసూరు నుంచి బయలుదేరాలి.
Day 6: ఆరో రోజు తెల్లవారుజామున ఉదయం 06.00 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
హైదరాబాద్ టూ ‘బెంగళూరు-ఊటీ-మైసూరు’ ప్యాకేజీ ధర
Hyderabad to Tour cost | నాన్ AC బస్ ప్యాకేజీలో పెద్దలకు రూ.9,900, పిల్లలు (5 నుంచి 12సంవత్సరాలు) రూ.7,920 చెల్లించాల్సి ఉంటుంది. ఇక టూర్ ప్యాకేజీలో వోల్వో బస్సులో ప్రయాణం, నాన్ ఏసీ వసతి కవర్ అవుతుంది.
పూర్తి వివరాల కోసం.. telangana tourism క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి