హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ చాంపియన్షిప్లో పాల్గొనే హైదరాబాద్ జట్టును ఈనెల 7న ఎంపిక చేయనున్నారు. బాలుర, బాలికల విభాగాల్లో సబ్ జూనియర్ అండర్-14, అండర్-19 జట్లను ప్రకటించనున్నారు. ఆసక్తి ఉన్న ఫెన్సర్లు దుండిగల్ మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎమ్ఎల్ఆర్ఐటీ) క్యాంపస్లో వ్యక్తిగత ఫెన్సింగ్ కిట్తో హాజరు కావాలని హైదరాబాద్ సంఘం ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.