హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ మారథాన్ రన్ తేదీ ఖరారైంది. గతేడాది కరోనా వైరస్ విజృంభణ కారణంగా రద్దయిన ఈ మారథాన్ రేసు ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగనుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భాగ్యనగరం వేదికగా వచ్చే నెల 19న పరుగు పందెం మొదలవుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. మారథాన్ రేసులో పాల్గొనే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన టీషర్ట్లను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేసుకు సంబంధించి వివరాలను భారతీ ఎయిర్టెల్ సీఈవో అవనీత్సింగ్ పూరి, హైదరాబాద్ మారథాన్ రేస్ డైరెక్టర్ ప్రశాంత్ మీడియాకు వివరించారు.