బంజారాహిల్స్, మార్చి 4 : సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముమ్మరం గా చేపడుతున్నామని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నం.4లోని సుఖ్దేవ్నగర్ బస్తీలో రూ.17లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. అదే బస్తీలో రూ.5లక్షల ఎమ్మెల్యే ఫండ్స్తో వేసిన బోర్ను, రూ.1లక్షతో నిర్మించిన సింటెక్స్ ట్యాంక్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలకు ఉపయోగపడే సంక్షేమ పథకాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని అన్నారు. అదే విధంగా ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించేందుకు రూ.9కోట్లు మంజూరయ్యాయని అన్నారు. అంతేగాక రూ.15కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, కమ్యూనిటీహాళ్ల నిర్మాణం తదితర పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కవితారెడ్డి, వెంకటేశ్వరకాలనీ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రాములు చౌహాన్, మహిళా విభాగం అధ్యక్షురాలు యండూరి మాధవి, నాయకులు యాదగిరి, కిరణ్, మూర్తి. అరుణ్, సాయికిశోర్. జాన్, చైతన్య పాల్గొన్నారు.