ఘట్కేసర్, మార్చి 3 : పోచారం మున్సిపాలిటీ సంస్కృతి టౌన్షిప్లోని శ్రీ విద్యానికేతన్ పాఠశాల తొలగింపు నిర్ణయంపై తల్లిదండ్రులు, విద్యార్థులు గురువారం పాఠశాల ఎదుట ఆందోళన చేసి, నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, టౌన్షిప్ కౌన్సిలర్ బి.హరిప్రసాద్రావు, టౌన్షిప్ అసోసియేషన్ సెక్రటరీ కేఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో తల్లిదండ్రులు శశి, ఇందిర, శిరీష, సుప్రజ, నర్సింహారెడ్డి, విద్యార్థులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ, లక్షల రూపాయల ఫీజులు కట్టించుకొని పాఠశాలను మూసివేస్తున్నామని తల్లిదండ్రులకు ఫిబ్రవరి 8న మెసేజ్లు పంపారని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం, హౌసింగ్ బోర్డు అధికారులు కల్పించుకొని పాఠాశాల యథావిధంగా కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.