మల్కాజిగిరి, జూన్ 27: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో పట్టణ ప్రగతి విజయవంతం అయింది. ఈ నెల 3నుంచి 18వరకు 16రోజుల పాటు ఉత్సాహంగా ఈ కార్యక్రమం కొనసాగింది. సర్కిల్ పరిధిలోని మల్కాజిగిరి, నేరేడ్మెట్, మౌలాలి, గౌతంనగర్, వినాయక్నగర్, ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్లలో ఒక్కో డివిజన్కు రెండు భారీ వాహనాలు, సిబ్బందిని కేటాయిం చారు. నోడల్ అధికారులు, సర్కిల్ డీసీతో పాటు అధికారులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 184 కాలనీల్లో 554 టన్నుల చెత్తను , 747 టన్నుల నిర్మాణ వ్యర్థాలను తొలగిం చారు.
27,200 ఇండ్లలో దోమల నివారణ కోసం మందును పిచికారి చేశారు. 25,657 నీటి గుంటలను గుర్తించి.. దోమలను లార్వా దశలోనే నివారించేందుకు మందులు చల్లారు. వివిధ కాలనీల నుంచి పారుతున్న 117 కిలో మీటర్ల పొడవుగా ఉన్న నాలాను శుభ్రం చేశారు. కాలనీల్లోని 34 బహిరంగ మూత్రశా లలు, మరుగు దొడ్లను, 24 శ్మశాన వాటికలు, 19 పార్కులను శుభ్రం చేయడంతో పాటు హరితహారంలో మొక్కలు నాటారు. ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. గుంతలుపడిన రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. నాలాల వద్ద ప్రమాదాలు జరగకుండా జాలీని ఏర్పాటు చేశారు.
ప్రజల కోసమే పట్టణ ప్రగతి..
ప్రజల కోసమే పట్టణ ప్రగతిని నిర్వహించాం. మల్కాజిగిరి సర్కిల్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాం. ప్రజల సహకారంతో ప్రతి కాలనీలో ఆరోగ్య శుభ్ర త కార్యక్రమం చే పట్టాం… మంచి ఫలితాలు వచ్చాయి. 16 రోజులు ఉత్సాహంగా అధికారులు, కార్పొరేటర్లు పాల్గొనడం అభివృద్ధికి చిహ్నం. వర్షాకాలంలో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లో హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి.
–మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే
రోడ్ల మరమ్మతులు భేష్..
పట్టణ ప్రగతిలో గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేపట్టడం భేష్. గత కొన్ని నెలలుగా గుంతలు పడినరోడ్లతో ఇబ్బందులు పడ్డాం. పట్టణ ప్రగతిలో అభికారులు గుంతలకు దగ్గరుండి మరమ్మతులు చేయించారు. పార్కుల్లో మొక్కలు నాటి.. కాలనీల్లో పంపిణీ చేయడం హర్షణీయం. దోమల నివారణ కోసం ఇండ్లలో నిలువ ఉన్న నీటి తొట్టీలను వారంలో ఒక్కరోజు డ్రైగా ఉంచేలా అవగాహన కల్పించారు. అధికారులందరూ కాలనీల్లోని సమస్యలను పరిష్కరించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– శోభ, మల్కాజిగిరి