సిటీబ్యూరో, జనవరి 27(నమస్తే తెలంగాణ): బిట్కాయిన్ ట్రేడింగ్ పేరిట ఓ ఇంజినీర్ ఖాతా ఖాళీ చేశారు సైబర్నేరగాళ్లు. కూకట్పల్లికి చెందిన సదరు ఇంజినీర్ని బిట్కాయిన్-ఫార్చ్యూన్ బీఐపీ35 వాట్సాప్ గ్రూపులో సభ్యుడిగా చేర్చారు. బిట్కాయిన్ ట్రేడింగ్లో లాభాలు పక్కాగా వచ్చేలా చేస్తామంటూ.. నమ్మించారు. బాధితుడు మొత్తం రూ. 25.42 లక్షలు పెట్టుబడిగా పెట్టగా, లాభం మాత్రం రూ. 54 లక్షలు పైగా చూపించినా.. విత్డ్రాకు అవకాశం లేకుండాపోయింది. మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.