వనస్థలిపురం, జనవరి 23 : వనస్థలిపురం సర్దార్ వల్లభాయ్ పటేల్ మైదానంలో రెండు రోజులుగా జరిగిన రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో పురుషుల విభాగం విజేతగా వరంగల్ జట్టు నిలవగా, ద్వితీయ స్థానంలో రంగారెడ్డి, తృతీయ స్థానంలో ఖమ్మం జిల్లా జట్లు నిలిచాయి. మహిళల విభాగంలో ఖమ్మం జిల్లా జట్టు విజేతగా నిలువగా ద్వితీయ స్థానంలో నిజామాబాద్, తృతీయ స్థానంలో వరంగల్ జట్లు నిలిచాయి. విజేతలకు ఆదివారం అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణారావు, బీఎన్రెడ్డినగర్ కార్పొరేటర్ లచ్చిరెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి రవీందర్, వివిధ జిల్లాల మేనేజర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.