అన్షు, వాసవి గణేశన్ జంటగా రూపొందిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘హుషార్ పిట్టలు’. బిక్షు దర్శకత్వంలో వెంకట్ యాదవ్ నిర్మించిన ఈచిత్రం ఈ నెల 15న విడుదలై థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్నది. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్, సురేష్ ఫిల్మ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాయి.
తొలివారం ప్రపంచవ్యాప్తంగా 5కోట్ల 7లక్షల గ్రాస్ను సాధించిందని మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో థ్యాంక్స్ మీట్ని నిర్వహించారు. చిత్ర దర్శకుడు బిక్షు, హీరో అన్షు, నిర్మాత కె.వెంకట్ యాదవ్, హీరోయిన్ వాసవి గణేశన్ సినిమా విజయం పట్ల ఆనందం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ చిత్రబృందానికి అభినందనలు అందించారు.