నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థరెడ్డి పాత్రలో కనిపించనున్నారు. కేథరిన్ థ్రెసా, కృతిశెట్టి కథానాయికలు. బుధవారం నితిన్ పుట్టినరోజు సందర్భంగా చిత్రం నుంచి ఫస్ట్ అటాక్ పేరుతో టీజర్ను విడుదల చేశారు. ‘పులి వేషం వేసుకున్న విలన్లతో హీరో పోరాడే భారీ ఫైట్ సీన్తో టీజర్ కట్ చేశారు. మాస్ను ఆకట్టుకునేలా ఈ యాక్షన్ సీక్వెన్స్ రూపకల్పన చేశారు. వేటకు, వేటుకు సై అనేలా ఉంది’ రాజకీయాంశాలతో కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్కు మంచి ప్రాధాన్యత ఇచ్చినట్లు టీజర్తో తెలుస్తున్నది. జూలై 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్రబృందం తెలిపారు.