న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఫార్మా రిటైల్ చైన్ నిర్వహిస్తున్న హైదరాబాదీ కంపెనీ మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. బిడ్స్కు ముగింపురోజైన బుధవారంనాటికి ఆఫర్ 52.59 రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి. 1,25,75,154 షేర్లను కంపెనీ ఆఫర్ చేస్తుండగా, 66,13,67,268 షేర్లకు బిడ్స్ అందినట్లు ఎన్ఎస్ఈ డాటా వెల్లడిస్తున్నది. సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం 111.89 రెట్లు, హై-నెట్వర్త్ ఇన్వెస్టర్ల విభాగం 85.33 రెట్లు చొప్పున సబ్స్క్రయిబ్ అయ్యింది.
రిటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేసిన షేర్లకుగాను, 5.23 రెట్లు షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. రూ. 1,398 కోట్ల సమీకరణకు షేరుకు రూ.780-796 ధరపై మెడ్ప్లస్ ఐపీవో ప్రారంభమయ్యింది. ఐపీవోలో రూ. 600 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీచేస్తుండగా, 798 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత షేర్హోల్డర్లు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయిస్తున్నారు. 2006లో మెడ్ప్లస్ను స్థాపించిన మధుకర్ రెడ్డి ప్రస్తుతం కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా ఉన్నారు.