హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): నూతన సచివాలయం ప్రాంగణంలో నిర్మించనున్న రెండు మసీదులను దేశంలోనే అత్యంత విశిష్టంగా, ఆదర్శనీయంగా తీర్చుదిద్దుతామని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. ఈ జంట మసీదులకు గురువారం హైదరాబాద్లోని నిజామియా యునివర్సిటీ వైస్చాన్సలర్ ముఫ్తీఖలీల్ అహ్మద్ సంగ్-ఏ-బునియాద్ (శంకుస్థాపన) చేశారు. ఈ సందర్భంగా మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. టర్కీ మసీదుల నమూనాలో, అద్భుత శైలిలో వీటిని నిర్మిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం మసీదుల నిర్మాణానికి 1,500 గజాల స్థలం కేటాయించారని తెలిపారు. పెద్ద మసీదులో ఇమామ్కు ఇల్లు కూడా నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. మహిళలు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లుచేస్తామన్నారు.
మసీదుల నిర్మాణానికి రూ.2.9 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఐదురోజుల నమాజులు, శుక్రవారం నమాజులు, తరావీహ్, ఈద్ ప్రార్థనలను సౌకర్యవంతంగా నిర్వహించుకునేలా వీటిని నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జామియా నిజామియా షేక్ జామియా, ముఫ్తీ గియాస్, శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్పాషా ఖాద్రి, దానం నాగేందర్, ఎమ్మెల్సీ ఫరూక్హుస్సేన్, వక్ఫ్బోర్డు చైర్మన్ సలీం, మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, ముస్లిం మత ప్రముఖులు రహీముద్దీన్ అన్సారీ, ఖమరుద్దీన్, మసీహుల్లాఖాన్, అక్బర్హుస్సేన్, మహ్మద్ యూసుఫ్ జాహిద్, సయ్యద్ అబ్దుల్ అలీమ్, ఇనాయత్ అలీ బాఖరీ, హైదర్ ఆఘా, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి యూసుఫ్ మియా తదితరులు పాల్గొన్నారు.