హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): జైళ్లశాఖ పనితీరును మరింత మెరుగుపర్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. సోమవారం ఆయన లక్డీకాకపూల్లోని తన కార్యాలయంలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, జైళ్లశాఖ డీజీ జితేందర్, ఐజీ వై రాజేశ్, డీఐజీలు మురళిబాబు, డాక్టర్ శ్రీనివాస్ తదితర ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. జైళ్లశాఖ పనితీరుపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. జైళ్లలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి డీజీ జితేందర్ మంత్రికి వివరించారు. జైళ్లలో ఖైదీలకు ఉపాధి శిక్షణ, హరితహారం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.