నేటితరం గాయనీ గాయకులు కాలపరీక్షకు నిలబడటం లేదని, వారు మరింత ప్రయత్నం చేయాలని అన్నారు దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా. చెన్నైలో ఇటీవల ఆయన సంగీత విభావరిని నిర్వహించారు. పాండమిక్ తర్వాత ఆయన మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంలో యువన్ శంకర్రాజా, దేవి శ్రీప్రసాద్, ఉషా ఉతుప్, కార్తీక్ వంటి గాయనీ గాయకులు పాల్గొన్నారు. ఇళయరాజా మాట్లాడుతూ…‘కొత్తవాళ్లను ప్రోత్సహించాలనేది నా ఆలోచన. ఇవాళ ఎంతోమంది గాయనీ గాయకులు వస్తున్నారు కానీ కాల పరీక్షకు నిలబడటం లేదు. మరింత అంకితభావంతో వాళ్లు ప్రయత్నించాలి. ఎస్పీ బాలు, కేజే ఏసుదాస్ల తరం ముగిసిపోయింది. ఓ వారం జనాలు పాడుకుంటే ఆ పాట గొప్పది కాదు. పాట చిరకాలం నిలిచిపోవాలి’ అన్నారు.