తెలంగాణలోనే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఫేమస్. ఇక్కడికి నిత్యం చాలామంది భక్తులు వస్తుంటారు. యాదాద్రి ఆలయాన్ని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అత్యంత సుందరంగా తెలంగాణ సర్కారు ఇటీవలే తీర్చిదిద్దింది. పనులన్నీ దాదాపు అయిపోయాయి. త్వరలోనే ఆలయ పునఃప్రారంభం కూడా కానుంది. అయితే, ఇక్కడికి వచ్చే భక్తులకు స్వామివారి దర్శనంతోపాటు నరసింహస్వామి దివ్య చరిత్ర కళ్లకు కట్టేలా యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటీడీఏ) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మరి ఆ ఏర్పాట్లు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.