హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): నానో యూరియాతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉందని ఇఫ్కో మార్కెటింగ్ డైరెక్టర్ యోగేందర్కుమార్ తెలిపారు. జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో జరుగుతున్న సదస్సులో ఆయన గురువారం ప్రసంగించారు. ఎన్నో పరిశోధనల అనంతరం నానో యూరియాను తయారుచేశారని, ఇది ఎరువుల రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణ అని ఆయన అభివర్ణించారు. రైతులకు మరింత మేలుచేసేలా, పర్యావరణానికి హానికలగకుండా ఎరువులపై ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఇఫ్కో నానో యూరియా స్టాల్ను వీసీ ప్రవీణ్రావుతో కలిసి ఆయన సందర్శించారు.