గయానా: వెస్టిండీస్ క్రికెటర్ షిమ్రాన్ హిట్మేయర్ టీ20 వరల్డ్కప్ జట్టు నుంచి ఔటయ్యాడు. ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన ఫ్లయిట్ను మిస్ కావడం వల్ల అతను వరల్డ్ కప్ జట్టుకు దూరం అయ్యాడు. హిట్మేయర్ స్థానంలో వరల్డ్కప్ జట్టులో షామ్రా బ్రూక్స్ ఆడనున్నట్లు ఐసీసీకి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. దీనిపై ఓ ప్రకటన కూడా రిలీజ్ చేశారు. నిజానికి హిట్మేయర్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు .. ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన విమానాన్ని రీషెడ్యూల్ చేసింది. ఫ్యామిలీ కారణాల చేత అక్టోబర్ ఒకటో తేదీన విమానాన్ని అందుకోలేనన్నాడు. దీంతో అక్టోబర్ మూడో తేదీన అతని కోసం మరో విమానంలో సీటు బుక్ చేశారు. అయితే సోమవారం కూడా అతను సరైన సమయానికి చేరుకోలేదని, దీంతో అతన్ని తుది జట్టు నుంచి తప్పించినట్లు వెస్టిండీస్ బోర్డు తెలిపింది. బుధవారం ఆస్ట్రేలియాతో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్కు కూడా హిట్మేయర్ దూరం అయ్యాడు. వరల్డ్కప్లో అక్టోబర్ 17వ తేదీన స్కాట్లాండ్తో విండీస్ తొలి మ్యాచ్ ఆడనున్నది.