సీనియర్ నటుడు శివాజీరాజా తనయుడు విజయ్రాజా హీరోగా నటిస్తున్న చిత్రం ‘వేయి శుభములు కలుగు నీకు’. తమన్నా వ్యాస్ నాయిక. రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తూము నరసింహా పటేల్, జామి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘వేల స్వర్గాలు’ అనే పల్లవితో కొనసాగే పాటను హీరో విశాల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ ‘ ఈ చిత్ర టైటిల్ ఎంతో పాజిటివ్గా వుంది. శివాజీరాజా తనయుడు నటిస్తున్న ఈ చిత్రం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు. నిర్మాణానంతర పనులు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.