హీరో ప్రభాస్ కొత్త సినిమా సెట్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ‘రాధేశ్యామ్’ సినిమా విడుదలయ్యాక స్వల్ప విరామం తీసుకున్న ఆయన తిరిగి కెమెరా ముందుకు వస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’చిత్రీకరణలో త్వరలో చేరనున్నారు ప్రభాస్. సైన్స్ ఫిక్షన్ కథతో భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా ‘ప్రాజెక్ట్ కె’ రూపొందుతున్నది. ఈ చిత్రంలో దీపికా పడుకోన్ నాయికగా నటిస్తుండ గా..అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా సెట్స్లో అడుగుపెట్టేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తాజాగా ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఆయన ఈ చిత్రం కోసం ఎంత ఆసక్తిగా ఉన్నారో ఈ మాటల్లో తెలుస్తున్నది. సాంకేతికంగా అత్యున్నత విలువలతో తెరకెక్కుతున్న ఈ మూవీలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నట్లు సమాచారం.