హైదరాబాద్: హీరో మహేశ్ బాబు మాతృమూర్తి, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరాదేవి మృతిపట్ల సీనియర్హీరో బాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆమె మరణం బాధాకరమని అన్నారు. ఇందిరాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారని. కృష్ణ, మహేశ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇందిరాదేవి తుదిశ్వాస విడిచారనే విషయం విచారం కలిగించిందని పవర్స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నానని చెప్పారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గత కొంతకాలంగా వయోసంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇందిరాదేవి బుధవారం ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె అంతిమ సంస్కారాలను హైదరాబాద్లోని మహాప్రస్థానంలో ఇవాళ మధ్యాహ్నం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అభిమానుల సందర్శనార్ధం ఆమె భౌతికకాయాన్ని పద్మావతి స్టూడియోలో ఉంచనున్నారు.
కాగా, ఇందిరాదేవి భౌతికకాయానికి ప్రముఖ నిర్మాత అశ్వినీదత్, దర్శకులు కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, రామకృష్ణ, హీరో వెంకటేశ్, జీవిత, రాజశేఖర్, బండ్ల గణేశ్ నివాళులర్పించారు.