సిటీబ్యూరో, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ): ‘హలో మాల్ వచ్చింది.. తీసుకెళ్లండి..’ అంటూ ఫోన్లు చేసి యువకులకు గంజాయి, హశీశ్ ఆయిల్ను విక్రయిస్తున్న ముగ్గురు స్నేహితులను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ఫోర్స్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..బోరబండకు బొర్ర సంతోష్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఇతడికి శోభన్ శివ, విజయ్కుమార్ స్నేహితులు. ఈ ముగ్గురు ప్రతిరోజూ మద్యం, సిగరెట్లు తాగుతూ జల్సా చేస్తున్నారు.వీటికి డబ్బులు సరిపోకపోవడంతో సంతోష్ తన సొంతూరు శ్రీకాకుళంలో ఉండే ప్రవీణ్ వద్ద గంజాయి, హశీశ్ ఆయిల్ను నగరానికి తీసుకొచ్చి.. తన స్నేహితుల ద్వారా మత్తుబాబులకు విక్రయించేవాడు. ప్రవీణ్ గంజాయి డెలివరీ చేయగానే సంతోష్ అతడి స్నేహితులకు ఇస్తే.. వారు తమకు టచ్లో ఉన్న యువకులకు ఫోన్ చేసి.. మాల్ వచ్చిందంటూ.. అమ్మేవారు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ ముగ్గురిని రహ్మత్నగర్ మైసమ్మ దేవాలయం వద్ద అరెస్టు చేశారు. వారి నుంచి 20 బాటిళ్ల గంజాయి, హశీశ్ ఆయిల్ను స్వాధీనం చేసకున్నారు. నిందితులను తదుపరి విచారణ కోసం జూబ్లీహిల్స్
పీఎస్కు అప్పగించారు.