ఖమ్మం : ఓ ప్రధానోపాధ్యాయుడు అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన వైరా మండలం కేజీ సిరిపురం గ్రామంలో చోటు చేసుకుంది. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా వైరాలోని ఓ థియేటర్లో ఆదివారం రోజు సిరిపురం జడ్పీహెచ్ఎస్కు చెందిన విద్యార్థులకు గాంధీ సినిమా చూపించారు. ఈ సినిమాకు విద్యార్థులతో పాటు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామారావు కూడా వచ్చాడు. విద్యార్థినుల మధ్య కూర్చొన్న రామారావు వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని బాధిత విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు తెలిపారు.
ఇక సోమవారం పాఠశాలకు వచ్చిన రామారావును విద్యార్థినుల తల్లిదండ్రులు చుట్టుముట్టి దేహశుద్ధి చేశారు. అక్కడ్నుంచి ప్రధానోపాధ్యాయుడు తప్పించుకుని, సర్పంచ్ ఇంట్లో తలదాచుకున్నాడు. ఇక పోలీసులు కూడా వచ్చేశారు. రామారావును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రామారావుపై కఠిన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.