లండన్ : ప్రపంచాన్ని వణికిస్తున్న మధుమేహం నివారణకు వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. మధుమేహం నియంత్రణలో లేకుంటే అది శరీరంపై పలు దుష్ర్పభావాలు చూపుతుంది. గుండె, కిడ్నీ జబ్బులకూ మధుమేహం దారితీస్తుంది. ఊబకాయం పెరిగిపోతుండటంతో యువతలోనూ పెద్దసంఖ్యలో డయాబెటిస్ ప్రబలుతోందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది.
జీవనశైలి మార్పులతో మధుమేహ ముప్పును నివారిస్తూ గుండెజబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్ల బారినపడకుండా ఉండవచ్చని హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిపుణులు సూచిస్తున్నారు. బరువును అదుపులో ఉంచుకోవడం, శారీరక వ్యాయామంతో పాటు చురుకుగా ఉండటం, మధ్యపానం, ధూమపానానికి దూరంగా ఉండటం, కొవ్వు, ప్రాసెస్డ్ పదార్ధాల జోలికి వెళ్లకుండా ఉండటం వంటి జాగ్రత్తలతో మధుమేహ ముప్పును తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అధికంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.