ముంబై: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఇటీవల తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆదివారం చెన్నైతో జరిగిన మ్యాచ్లోనూ ముంబై జట్టు ఓటమి చవి చూసింది. అయితే ఆ మ్యాచ్లో పాండ్యా బౌలింగ్, కెప్టెన్సీ చాలా పేలవంగా ఉన్నట్లు మాజీ క్రికెటర్ గవాస్కర్(Gavaskar) ఆరోపించారు. ముంబై కెప్టెన్సీ చేపట్టిన నాటి నుంచి హార్దిక్పై ఆన్లైన్లో విమర్శలు వెల్తువెత్తుతున్న విషయం తెలిసిందే. పాండ్యా వేసిన ఫైనల్ ఓవర్లో 26 రన్స్ వచ్చాయి. దాంట్లో ధోనీ ఒక్కడే 20 రన్స్ స్కోర్ చేశాడు. దీనిపై గవాస్కర్ కామెంట్ చేశాడు. ఇది నిజంగా పసలేని బౌలింగ్, కెప్టెన్సీ అని, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబేలు బాగా ఆడినా.. రన్స్ను అదుపు చేశారని, చెన్నైని 190 లోపే కట్టడి చేస్తే బాగుండేదని, కానీ చాలా దారుణమైన బౌలింగ్ వేసినట్లు గవాస్కర్ పేర్కొన్నాడు. మొదటి సిక్స్ ఓకే అని, కానీ ఆ తర్వాత లెన్త్ బాల్ వేశాడని, బ్యాటర్ పరుగుల దాహంతో ఉన్నప్పుడు అలాంటి బాల్ ఎలా వేస్తారని అన్నాడు. ఇక మూడవ బాల్ ఫుల్ టాస్ పడిందన్నాడు. మూడు ఓవర్లు వేసిన పాండ్యా రెండు వికెట్లు తీసుకుని 43 రన్స్ ఇచ్చాడు.
స్టేడియంలోని అరుపులు, కేకల ప్రభావం పాండ్యాపై ఎక్కువ ఉన్నట్లు అర్థమవుతోందని పీటర్సన్ తెలిపారు. టాస్ వేస్తున్న సమయంలోనూ అతను ఎక్కువగా నవ్వుతున్నాడని, సంతోషంగా ఉన్నట్లు కనిపించేందుకు నటిస్తున్నాడని, అతను సంతోషంగా లేడని, అలాంటి పరిస్థితిని ప్రత్యక్షంగా చూశానని, పాండ్యాను ధోనీ అన్ని దిక్కులా దంచేశాడని, అది నిన్ను బాధకు గురిచేస్తుందని, ఇలాంటి ఘటన వల్ల ఆటపై ప్రభావం పడుతుందని, పాండ్యా ఏదో ఒకటి చేయాల్సి ఉంటుందని పీటర్సన్ తెలిపాడు. పేసర్లను టార్గెట్ చేస్తున్న సమయంలో పాండ్యా ఎందుకు స్పిన్నర్లను వాడలేదని ప్రశ్నించాడు.