హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ సమీపంలో మరో గోల్ఫ్ కౌంటీ అందుబాటులోకి వచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెదక్ జిల్లా తుఫ్రాన్ దగ్గర హల్దీ గోల్ఫ్ కౌంటీ తొమ్మిది హోల్స్తో రూపుదిద్దుకుంది. దేశంలో నది తీరాన నిర్మించిన తొలి గోల్ఫ్ కోర్స్గా నిలిచిన ఈ కౌంటీని భారత క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కపిల్ మాట్లాడుతూ ‘గోల్ఫ్ క్రీడ ద్వారా జీవితానికి ప్రశాంతత చేకూరుతుంది. పచ్చని బయళ్ల మధ్య ఆడుతూ ఒకరికొకరు సంభాషించుకోవడం ద్వారా మనసుకు స్వాంతన చేకూరుతుంది. నదితీరా ప్రాంతంలో నిర్మితమైన హల్దీ గోల్ఫ్ కౌంటీ అద్భుతమైన అనుభూతి కల్గిస్తుంది. అత్యుత్తమ గోల్ఫ్ కోర్స్గా ఇది నిలుస్తుంది’ అని అన్నాడు. ప్రారంభ కార్యక్రమంలో సంతోష్రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ఆకాశ్రెడ్డి పాల్గొన్నారు.