పుణె: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్లో వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన పోరులో గుజరాత్ 14 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. మొదట గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (46 బంతుల్లో 84; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (31) ఫర్వాలేదనిపించాడు. ఢిల్లీ బౌలర్లలో ముస్తఫిజుర్ 3, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు చేసింది. కెప్టెన్ రిషబ్ పంత్ (43) టాప్ స్కోరర్ కాగా.. పృథ్వీ షా (10), టిమ్ సీఫెర్ట్ (3), మన్దీప్ సింగ్ (18), అక్షర్ (8), శార్దూల్ (2) విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో ఫెర్గూసన్ 4, షమీ రెండు వికెట్లు పడగొట్టారు. ఫెర్గూసన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఐపీఎల్ 15వ సీజన్లో భాగంగా ఆదివారం చెన్నైతో పంజాబ్ తలపడనుంది.
న్యూఢిల్లీ: రానున్న ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్, ఆసియా గేమ్స్తో పాటు థామస్, ఉబర్ కప్ టోర్నీల కోసం బ్యాడ్మింటన్ ట్రయల్స్ మొదలుకాబోతున్నాయి. ఈ నెల 15 నుంచి 20 వరకు ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా ట్రయల్స్ నిర్వహిస్తామని భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్(బాయ్)ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో పాటు పారిస్(2024) ఒలింపిక్స్ కోసం కోర్ టీమ్ను ఎంపిక చేయనున్నారు. బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో టాప్-15లో ఉన్న ప్లేయర్లను నేరుగా పరిగణనలోకి తీసుకోనుండగా, మిగతా వారిని ట్రయల్స్ ద్వారా ఎంపిక చేయనున్నారు. దీంతో పీవీ సింధు, శ్రీకాంత్, లక్ష్యసేన్, చిరాగ్శెట్టి, సాత్విక్సాయిరాజ్ జోడీ మెగా టోర్నీలకు నేరుగా ఎంపికయ్యే అవకాశముంది.
గుజరాత్: 20 ఓవర్లలో 171/6 (గిల్ 84, హార్దిక్ 31; ముస్తఫిజుర్ 3/23), ఢిల్లీ: 20 ఓవర్లలో 157/9 (పంత్ 43; ఫెర్గూసన్ 4/28).